టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం…!

అమరావతి : నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చిన కొంతమంది నాయకులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిలు నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజల, కార్యకర్తల వారి సమస్యలు కోసం తన నివాసంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేకమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పై కేసు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల చిన్న చిన్న సమస్యలు కూడా తెచ్చుకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జులు ఐ టి డి పి, సోషల్ మీడియా వాళ్ళు వద్ద వివరాలు ఉంటాయి వారి వద్ద నుంచి అనేక సమస్యలను సేకరించండి అని సూచించారు. పార్టీ చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సోషల్ మీడియా, ఐటిడిపి, వాళ్లని తీసుకొని ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో గుర్తింపు వచ్చే విధంగా చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version