Day: July 1, 2024

APSPDCL విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ బిల్లులు కట్టాలని తెలిపారు. RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APSPDCL డిస్కమ్ పేరు కనిపించదు. కనుక మీరు APSPDCL Consumer App ని […]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి […]

ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి రోడ్డు లేకుండా చేశారు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో ఆదోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల నుంచి […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 01-07-24 పత్తి అత్యధికంగా ₹. 7614 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5513/- రూపాయలు కనిష్ట ధర ₹. 4115/- రూపాయలు పలికింది.

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం(జూన్‌30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాఖ అశోక్‌ తెలిపారు.

Back To Top
Exit mobile version