పేద బలహీన బడుగు వర్గాల వారికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల మెడికల్ విద్యను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్..
కర్నూలు జిల్లా సునీల్ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పై డివిజన్ స్థాయి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ఉల్లిద్ర యోసోబు ఆధ్వర్యంలో నిర్వహించరు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాయలసీమ ఎస్సీ సెల్ ఇంచార్జ్ సునీల్, జిల్లా ఇన్చార్జ్ ఉప్పర పాడి యోబు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు డివిజన్ స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.