సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరం

సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించి ‘ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం’ అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా హొళగుంద మండలం, పెద్ద హెట్ట గ్రామంలో బడికి వెళ్లేందుకు బస్సు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ట్యాగ్ చేస్తూ 2024 జూలై 26న ఒక పోస్ట్ పెట్టారు. అంతే! వారం రోజుల్లో ఆ పల్లెకు బస్సు వెళ్ళింది. విద్యార్థులు గ్రామస్తులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version