Connect with us

News

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల20 వేలు ఆర్థిక సహాయం

Published

on

ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల 20 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు. కార్వాన్ పేట్ వీధి కి చెందిన నరసింహులు 4 లక్షల 20 వేల రూపాయలు, బోయగిరి వీధి కి చెందిన వి. చంద్ర లివర్ చడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందినడు అతని కుటుంబానికి 3 లక్షల 20 వేల రూపాయలు, మరాఠీ గేరికి చెందిన చాంద్ బాషా అనే వ్యక్తి 1 లక్ష 20 వేలు, పెద్ద హరివాణం గ్రామానికి చెందిన బెంజి గర్జన్నకు 20వేల రూపాయలు, పెద్ద తుంబలం గ్రామానికి చెందిన గంజాల రంగమ్మ కు 1 లక్ష 40 వేల రూపాయలు వైద్య ఖర్చులకు గా సీఎం రిలీఫ్ ద్వారా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెక్కులను అందజేశారు.

నరసింహులు కు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చంద్ర కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

News

తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఇరవై (20) గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన డ్యామ్ అధికారులు. (2.5) రెండు నర్ర అడుగులు ఎత్తుకు 20 గేట్లు ఎత్తి దిగువకు 62766 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13748  క్యూసెక్కులు

Continue Reading

Trending