కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 2,30,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న బి.భీమా లింగప్ప బాధితుల కుటుంబంకు అందజేశారు. బాధ్యత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తామన్నారు.