కరెంటు కోతలకు వ్యతిరేకంగా టార్చ్ లైట్లతో నిరసన
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గత ఐదు రోజులు గా రాత్రిపూట తీస్తున్న కరెంటు కోతలకు వ్యతిరేకంగా పాండవగల్లు గ్రామంలో టార్చ్ లైట్ తో సిపిఎం పార్టీ నిరసన తెలిపారు. రాత్రిపూట కరెంటు కోతలు విధిస్తూ కూటమి ప్రభుత్వం మరియు కరెంట్ అధికారులు ప్రజలను పట్టించుకోవడంలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే. రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.