కైలాస మానససరోవర యాత్రికులకు ఆదోని ఎమ్మెల్యే భరోసా

​కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం తీర్థ  యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి,  భార్య శారద తో  పాటు కొడుకు రఘునాథ శాస్త్రి,  కోడలు హన్సిక. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు […]

దేవాలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రజకుల కులదైవం శ్రీ మడివాల మాచయ్య స్వామి దేవాలయ నిర్మాణానికి బుధవారం (26 ఆగస్టు 2026) ఘనంగా భూమి పూజ నిర్వహించారు. రజక సంఘం ఆహ్వానం మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి రజకుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఆయన […]

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

హోస్పేట: 26.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. ఆగస్టు 26 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.25 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 95.009 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

ఆదోనిలో ఎమ్మెల్యే డా. పార్థసారథి ఇంటింటి పర్యటన

కర్నూలు జిల్లా ఆదోని లో ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి మంగళవారం ఉదయం పట్టణంలోని 15వ వార్డు కార్వన్‌పేటలో ఇంటింటికీ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు: ​మౌలిక వసతులు: జలగల వీధిలో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, బండి మెట్ట రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న చెత్త బాక్స్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే […]

రూ.10.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.10,70,888 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి […]

రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రాలయం లో ప్రత్యేక పూజలు

​కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ​మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత […]

రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రాలయం లో ప్రత్యేక పూజలు

​కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మఠం దర్శనానికి ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామదేవత […]

రైతులను ఇబ్బంది పెడితే లైసెన్స్ రద్దు చేస్తాం

నిబంధనలు ఉల్లంఘిస్తే దళారీల లైసెన్సులు రద్దు చేస్తామని ఆదోని మార్కెట్‌యార్డ్ కమిటీ పాలకవర్గం హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డు లో దళారులు నిబంధనలను పాటించకుండా రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేస్తామని ఆదోని మార్కెట్‌యార్డ్ పాలకవర్గం స్పష్టం చేసింది. ​మార్కెట్‌యార్డులో జరుగుతున్న వేరుశనగ కొనుగోలు ప్రక్రియను మార్కెట్‌యార్డ్ కమిటీ చైర్మన్ జిందే శారద, వైస్ చైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ, సెక్రటరీ సీతారామయ్య మరియు […]

ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తీవ్రరూపం దాల్చుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే తక్షణమే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గత 38 సంవత్సరాలుగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం మరియు స్వార్థ ప్రయోజనాల వల్లే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. పట్టణ అవసరాల నిమిత్తం వచ్చే స్థానిక, గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ ట్రాఫిక్ ఇబ్బందులతో […]

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ భూతం నుండి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రిటైర్డ్ డీఎస్పీ కొండారెడ్డి, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగభూషణం, వాకర్స్ కో-ఆర్డినేటర్ న్యాయవాది జీవన్ సింగ్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, చిన్నారులు, అథ్లెట్లు […]

Back To Top