కైలాస మానససరోవర యాత్రికులకు ఆదోని ఎమ్మెల్యే భరోసా
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం తీర్థ యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి, భార్య శారద తో పాటు కొడుకు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు […]