ఆదోని పరిసరాల్లో స్వల్ప భూకంపం: రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి సుమారు 7:45 నుంచి 7:50 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.