తుంగభద్ర జలాశయంనికి తగ్గుతున్న వరద ప్రభావం

హోస్పేట: 21.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 21 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.18 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.743 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

ఆదోనిలో 22, 23 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

ఆదోని (ఆగస్టు 20): కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 22 (శనివారం), 23 (ఆదివారం) తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు / అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) మరియు 284 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) […]

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఆదోని రూరల్ (కర్నూలు జిల్లా): మండల పరిధిలోని నెట్టేకల్ గ్రామ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గంగాధర్ సింగ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం పట్టణానికి చెందిన గంగాధర్ సింగ్ నెట్టేకల్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో నెట్టేకల్ గ్రామ సమీపంలోని ఓ మలుపు వద్దకు చేరుకోగానే వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయి అతడు ఘటనా స్థలంలోనే మృతి […]

తుంగభద్ర జలాశయంనికి తగ్గుతున్న వరద ప్రభావం

హోస్పేట: 20.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 20 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.12 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.414 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

విజయవాడ, ఆగస్టు 18: ఆయకట్టు రైతులకు సాగునీటితో పాటు పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో మంగళవారం తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై మంత్రి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తుంగభద్ర పరివాహక ప్రాంత పరిస్థితులు, నీటి లభ్యత, […]

పంచాయతీలో నిధులు ఖాళీ.. కార్మికుల కడుపు ఖాళీ!

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేవనే నెపంతో కార్మికుల జీతాలు నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని స్వీపర్లు, వాటర్‌మెన్లు తదితర సిబ్బందికి 4 నెలల నుంచి […]

సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేయాలి

కర్నూలు జిల్లా అదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట న్యాయవాదులు శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో శాశ్వత హైకోర్టు లేదా శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదోని బార్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల పిలుపు మేరకు మూడు రోజుల పాటు (ఆగస్టు 19 నుండి 21 వరకు) కోర్టు […]

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 19.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 19 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.03 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.171 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

విజయవాడ, ఆగస్టు 18: ఆయకట్టు రైతులకు సాగునీటితో పాటు పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో మంగళవారం తుంగభద్ర ప్రాజెక్టు నీటి విడుదల అంశంపై మంత్రి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తుంగభద్ర పరివాహక ప్రాంత పరిస్థితులు, నీటి లభ్యత, […]

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి హత్యాయత్నం కేసులో బెయిల్.. మిగతా కేసుల వల్ల జైల్లోనే కొనసాగింపు

ఆదోని: కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షికి ఓ హత్యాయత్నం కేసులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఆదోని 2వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఆయనపై నమోదైన మరో రెండు కేసుల్లో ఇంకా బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. మొత్తం 35 మంది […]

Back To Top