Connect with us

News

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల20 వేలు ఆర్థిక సహాయం

Published

on

ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల 20 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు. కార్వాన్ పేట్ వీధి కి చెందిన నరసింహులు 4 లక్షల 20 వేల రూపాయలు, బోయగిరి వీధి కి చెందిన వి. చంద్ర లివర్ చడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందినడు అతని కుటుంబానికి 3 లక్షల 20 వేల రూపాయలు, మరాఠీ గేరికి చెందిన చాంద్ బాషా అనే వ్యక్తి 1 లక్ష 20 వేలు, పెద్ద హరివాణం గ్రామానికి చెందిన బెంజి గర్జన్నకు 20వేల రూపాయలు, పెద్ద తుంబలం గ్రామానికి చెందిన గంజాల రంగమ్మ కు 1 లక్ష 40 వేల రూపాయలు వైద్య ఖర్చులకు గా సీఎం రిలీఫ్ ద్వారా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెక్కులను అందజేశారు.

నరసింహులు కు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చంద్ర కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

News

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

Published

on

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో పూజకు వెళ్తున్న ఫోటో

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి,  చీరలతో  సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం  ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.  చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి  కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.

కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తాన్న ఫోటో
రథి మన్మధుల దేవుళ్ల
Continue Reading

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Trending