రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ లో పర్యటన కార్యక్రమం వచ్చే జూన్ ఒకటవ తేదీకి మార్పు అయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటన లో తెలిపారు.. అనివార్య కారణాల వల్ల ఈ మార్పు జరిగిందని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఈ నెల 30 వ తేదీన కాకుండా వచ్చే జూన్ నెల ఒకటవ తేదీన ఉంటుందని కలెక్టర్ ఈ ప్రకటన లో […]
ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 2,30,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న బి.భీమా లింగప్ప బాధితుల కుటుంబంకు అందజేశారు. బాధ్యత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తామన్నారు.