Day: August 15, 2023

ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆదోని.. విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలని ఆదోని స్పెషల్ సబ్ జైలు జైలర్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని దుల్షా పైల్వాన్ మసీదు కమిటీ ప్రధాన ముతవల్లి షేక్ జక్రియ ఆధ్వర్యంలో దుల్షా పైల్వాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన […]

మార్కెట్ యార్డల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేసి ఫ్లాగ్ సెల్యూట్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ మరియు వైస్ చైర్మన్ తిమ్మప్ప మాట్లాడుతూ రైతులకు మార్కెట్ యార్డ్ ఉద్యోగులకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు భారతదేశ ఖ్యాతిని మరియు గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థినీ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమరయోధులుగా మరియు నాయకులుగా వేషాధారణతో అందరినీ ఆకర్షించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటుతూ విద్యార్థులు అలరించారు. ఫ్లాగ్ సెల్యూట్ మరియు మార్చ్ ఫాస్ట్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు దేశ స్వాతంత్ర వీరులను కొనియాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం. మేఘనాథ్ […]

వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం తో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని పేదలకు అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎగరవేశారు. అనంతరం ఎస్ఈఆర్పి(SERP) వైఎస్ఆర్ క్రాంతి పథకంలో ఉద్యోగస్తులకు […]

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రైల్వే శాఖకు 2 వీల్ చైర్స్

కర్నూలు జిల్లా ఆదోనిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఆదోని ఆధ్వర్యంలో ఆదోని రైల్వే స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి రైల్వే శాఖకు రెండు వీల్ ఛైర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విట్ట శ్రావణి, సెక్రెటరీ మాలతి, ట్రెజరర్ రాయచోటి అభిరూప, ఐ ఎస్ ఓ లీన, మరియు సత్య, కోమల ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, రైల్వే స్టాఫ్, పోలీస్ బృందం పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version