కర్నూలు జిల్లా ఆదోనిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఆదోని ఆధ్వర్యంలో ఆదోని రైల్వే స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి రైల్వే శాఖకు రెండు వీల్ ఛైర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విట్ట శ్రావణి, సెక్రెటరీ మాలతి, ట్రెజరర్ రాయచోటి అభిరూప, ఐ ఎస్ ఓ లీన, మరియు సత్య, కోమల ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, రైల్వే స్టాఫ్, పోలీస్ బృందం పాల్గొన్నారు.


