హోస్పేట: 29.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 29 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1608.70 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 35.087 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 14614 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 13951 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 3691 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1624.62 అడుగులుగా ఉండగా.. 75.258 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 67.227 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదోని:  పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదోని – మాధవరం రోడ్డుపై పాండవగల్లు వద్ద మంగళవారం నిరసన తెలపడం జరిగింది.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా పాండవగల్ పెద్ద చెరువు సమస్య హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రేపు ఆయన ఆదోనికి వస్తున్న సందర్భంగా, ఈ చెరువు సమస్యపై స్పష్టమైన ప్రకటన చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నిరసనలు తీవ్రతరం చేసి, తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పెద్దలు కే.మారయ్య, పి.ఈరన్న, మాజీ వైస్ సర్పంచ్ జే.తిక్కయ్య, రామాంజనేయ, కే.హనుమంతు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే.రామాంజనేయులు, మండల నాయకులు కే.పాండురంగ, శాఖా కార్యదర్శులు కే.గోవిందు, అనీఫ్ బాషా, నర్సిరెడ్డి, భీమాంజనేయులు, తాయప్ప, తాయన్న, హనుమంత రెడ్డి, కొండయ్య, రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.హుసేని, డీజే నర్సిరెడ్డి, మంజు, పాండవగల్ గ్రామ విద్యా కమిటీ చైర్మన్ S.తాయన్న, DYFI సీనియర్ నాయకులు ఎస్.రామాంజనేయులు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు కె.వీరేష్, కె.వీరంజి, మండల నాయకులు మోహన్ రెడ్డి, గ్రామ నాయకులు భాస్కర్, S.తాయాన్న, కే.రామకృష్ణ, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

హోస్పేట: 28.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 28 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1608.19 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 34.148 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 21773 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 19179 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 3600 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1624.54 అడుగులుగా ఉండగా.. 75.001 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 96836 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో అరుణాదేవి

ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వంటశాలను పరిశీలిస్తున్న ఆర్డీవో అరుణాదేవి

​అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ… మెనూ ప్రకారమే పోషకాహారం అందించాలని, పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని వార్డెన్లను హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తనిఖీల్లో గుర్తించిన చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆదోనిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఉపేంద్ర (తండ్రి: లక్ష్మన్న) అనే యువకుడు జులై 26వ తేదీ (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఆదోని – నగరూరు రైల్వే స్టేషన్ల మధ్యన ఉన్న కేఎం నంబర్ 492/23-25 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి రైలు (Train No. 11301) లోకో పైలట్ అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

మృతుడు ఉపేంద్ర తండ్రి లక్ష్మన్నకు ఒక్కడే కుమారుడు కావడం, ఈ నెల (జులై) 9వ తేదీనే అతనికి వివాహం జరగడం విశేషం. పెళ్లయిన కొన్ని రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంద్రానగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

​సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని హెడ్ కానిస్టేబుల్ శివ రామయ్య తెలిపారు.

ఆదోని క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల జూలై 29 నుండి ఆగస్టు 8 వరకు కడపలో జరగనున్న అండర్-19 సౌత్ జోన్ మ్యాచ్‌లకు ఆదోనికి చెందిన మల్లికార్జున ఎంపికయ్యాడు. అలాగే, అండర్-15 బాలికల సౌత్ జోన్ జట్టుకు వై. మేఘనా రెడ్డి, ఎన్. లావణ్య ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్లకు ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విట్టా రమేష్, ఉపాధ్యక్షులు ముజీబ్, కార్యదర్శి వెంకటేష్, సభ్యులు జె.ఎం. బాషా, వెంకటేష్ బాబు, కోచ్ బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే మ్యాచ్‌లలో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ సౌత్ జోన్ స్థాయికి ఎంపికయ్యేలా సహకరించిన కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) కు, కోచ్‌లకు ఆదోని క్రికెట్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా, ఆటగాళ్ల శిక్షణకు, ఎంపికలకు అవసరమైన గ్రౌండ్ సదుపాయాన్ని నిరంతరం అందిస్తున్న ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యాజమాన్యానికి అధ్యక్షులు విట్టా రమేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం హవనపేట వీధి లో ఉన్న వెంకట నర్సప్ప ఆలయ ప్రాంగణంలో భారీ రావిచెట్టు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఒక్కసారిగా నేలకొరిగింది. ఉదయం వేళ రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు ఇద్దరు వ్యక్తులకు సులభంగా గాయాలైనట్లు తగిలినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. భారీ చెట్టు కూలిపోవడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోయాయి. దీంతో కొంతసేపు స్థానికులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. అనంతరం సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

నేలకొరిగిన రావి చెట్టు
దెబ్బతిన్న వాహనాలు
చెట్టును నేలకొరకడంతో చూస్తున్న స్థానికులు

హోస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 27 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1607.32 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 32.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 20060 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 23334 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 3564 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1624.81 అడుగులుగా ఉండగా.. 75.870 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 64.925 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ ఎరుకుల కాలనీలో ఏకలవ్య జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్య జీవిత విశేషాలు, త్యాగం, ధనుర్విద్యలో సాధించిన అపూర్వ ప్రతిభను స్మరించుకున్నారు.

వేడుకలలో పాల్గొన్న ముఖ్య అతిథులు

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ బ్యాంకు ఉద్యోగి ఎరుకుల మరెన్న, మాజీ కౌన్సిలర్ లక్ష్మప్ప, ఎరుకుల నాగేష్, ఎరుకుల ఈరన్న, ఎరుకుల ఉరుకుందప్ప, ఎంఈవో రామ్‌మూర్తి, ఈఈఓ వెంకటేష్, ఆదివాసి జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ఎరుకుల మారుతి రావు, ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రవికుమార్, కానిస్టేబుల్ ప్రకాష్, బల్లేకల్ ఈరన్న, అయ్యప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఏకలవ్యుని జీవిత చరిత్ర ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కష్టపడి సాధించాలనే తపన, గురుభక్తి, ఆత్మగౌరవానికి ఏకలవ్యుడు నిలువెత్తు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. నేటి సమాజంలోని యువత ఏకలవ్యుని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకలు నిర్వహించడంలో  యువత చూపిన కృషిని పలువురు అభినందించారు.

వేడుకలలో పాల్గొన్న కాలనీవాసులు
ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఫోటో

ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీకి చెందిన యువకులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హోస్పేట: 26.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 26 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1606.50 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 31.183 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 12869 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 12915 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 3561 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.43 అడుగులుగా ఉండగా.. 77.907 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 44384 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.