అబివృద్ది పై సమీక్ష సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం , జిల్లా పరిషత్ చైర్మన్ , స్థానిక సంస్థల MLC – Dr మదూసుధన్ , మున్సిపల్ చైర్మన్ శాంత , ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మరియు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు


ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని , ఆలూరు అబివృద్ది కి స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనల పై చర్చలు జరిగాయని. అందులో భాగంగా ఆదోని లో బైపాస్ నిర్మాణం , ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , మైనారిటీ జూనియర్ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకం, ఆటో నగర్ ఏర్పాటు , SS ట్యాంక్ మరమ్మత్తులు , పలు గ్రామాలకు రోడ్డు , త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రతిపాదన ఇవ్వగా , ఆలూరు నియోజక వర్గం నుండి జింకల పార్కు , గ్రామాలకు త్రాగు నీరు , రోడ్డు సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలు , సంతమార్కెట్ , MRO ఆఫీస్ భవనం , R&B వసతి గృహం , రైతు భరోసా కేంద్రాల నిర్మాణం , ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీస్ , ఆస్పరి మండలంలో పొట్లపాడు వంతెన నిర్మాణం , దేవనకొండ లో మోడ్రన్ స్కూల్ ఏర్పాటు , PHC ల మరమ్మతులు వంటి సమస్యల పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

సమావేశంలో హాజరైన అధికారులు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top