News
వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించి అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల ఉపతహసీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమము నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా 2024 తుది ఓటర్ల జాబితాను రూపొందించలని కోరారు. గ్రామ/వార్డు వాలంటీర్లు ఎన్నికలకు ఏవిధమైన పనులలోనూ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూతు స్థాయి అధికారులకు ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్- 2024 కి సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహలు ఉండకుండా, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొమని సూచిస్తూ, ఇంటింటి ఓటరు సర్వేలో భాగస్వామ్యుల అయ్యేలా చూడాలన్నారు. ఏజెంట్ల జాబితాను ఎన్నికల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ఓటర్ల పరిశీలన చేస్తున్న సమయంలో
ఏజెంట్లు తప్పనిసరిగా ఉండేల చూడాలని అన్నారు. ఎఈఆర్ఓలు ఓటరు నమోదు మరియు తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ఆమోదించాలన్నారు. మరణించిన వారి జాబితాను మరణ ధ్రువీకరణ పత్రము లేదా పంచనామ ద్వారా ధ్రువీకరించి, క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగించలన్నారు. ఒకే ఇంటిలో ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉంటే వేరువేరుగా నివాసాలు ఉన్న వారికి ఒక పద్దతి ప్రకారం ఇంటి నెంబరు ఇవ్వాలన్నారు. ఒకే పోలింగ్ బూత్ లో చేర్చాలని , ప్రతి ఓటరు తన ఇంటి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఏఈఆర్ఓ మరియు ఎన్నికల తహశీల్దార్లు వారి సంబంధిత నియోజకవర్గములోని ప్రతి కళాశాలలో SVEEP కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ట్రాన్స్ జెండర్స్ , సెక్స్ వర్కర్లు మొదలగువారు ఓటర్లుగా నమోదు చేయవలసిందిగా కోరారు. ప్రస్తుతము వయస్సు 17 సంవత్సరాలు ఉండి జనవరి 2024 సంవత్సరానికి 18 సంవత్సరాలు వచ్చే వారిని కూడా గుర్తించి సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలని తెలిపారు. 90 సంవత్సరాలు నిండిన వారు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఉంటే ఇంటి దగ్గరే ఓటు వేసుకునే అవకాశం కల్పించడానికి తగిన సమాచారం సేకరించి పెట్టుకోవాలని కోరారు.
*కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రోల్ రేషియో ప్రకారం 680 నుండి 720 వరకు electoral population ratio ఉండాలి కాని ఆదోని నియోజకవర్గం electoral population ratio 845 వరకు ఉన్నది. నియజకవర్గం నుండి వెళ్లిపోయిన, మరణించిన వారి ఓట్లు తొలగించాలని వాటికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించుకొని తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో తాసిల్దార్ వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ్మ అధికారులు పాల్గొన్నారు.



News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
