Author: Public Judgement

భార్యతో గొడవ పడి ఫినాయిల్ తాగిన భర్త

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన హుసేని (35 సం.) ఫినాయిల్ తాగిఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన బంధువులు హుటా హుటిన రాత్రి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పపమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య తన మాట వినలేదని భార్యతో గొడవపడి రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న ఫినాయిల్ ను తన కొడుకు హుసేని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. గమనించిన కుటుంబ సభ్యులు రాత్రి […]

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 13 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీతుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుఇన్ ఫ్లో : 35425 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 109526 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1629.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 91.311 టీఎంసీలు 13 08 2024 మంగళవారం ఉదయం 1 లక్ష 14 వేలకు పైగా నీరుని నదిలోకి వదులుతున్నామని డ్యాం అధికారులు తెలిపారు. నది తీర […]

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..! తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం… కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు… ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.

శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేత

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో డ్యామ్ గేట్లు మూసివేశారు. విదుత్ ఉత్పాదన అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ అధికారులు తెలిపిన నీటినిలువ వివరాలు ఇలా ఉన్నాయి… ఇన్ ఫ్లో : 86,220 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 68,211 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 880.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 192.5300 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు […]

అందరికీ ఉపాధి పనులు కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆదోని మండలంలోని గ్రామాలలో 11 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, మండలంలో అందరికీ పనులు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఏపీఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత జూన్ నెల నుండి ఇప్పటి వరకు పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదని, దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని […]

స్కూళ్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు తీసుకోండి

ఆదోని నియోజకవర్గలోని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం పెట్టని స్కూల్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారంగా అన్నం పెట్టకుండా విద్యార్థుల కడుపు కొడుతున్న వంట ఏజెన్సీ లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని లేనిపక్షంలో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద […]

సర్పంచ్ , కార్యదర్శుల కు శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీఓ కార్యాలయం లో సర్పంచ్ , కార్యదర్శుల కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. దొడ్డనగేరి సర్పంచ్ పార్వతమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లాగా మీరుకూడా ఇబ్బందులకు గురి చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకొన్నారు.

దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మన గుడి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ మనగుడి సంస్థ ద్వారా ఆదోని మండలంలో సమాచార హక్కు ద్వారా స్వీకరించిన వివరాలలో సర్వే నంబర్ల పాత సర్వే నెంబర్లతో మ్యాచ్ అవడం లేదని, రికార్డుల […]

బస్సు స్కూటర్ ఢీ ఇద్దరికీ గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో రైల్వే బ్రిడ్జి పైన బస్సు స్కూటర్ ఢీ కొట్టడంతో కోసిగి మండలం, డి బెలగల గ్రామానికి చెందిన లక్ష్మన్న, తలారి వెంకటేష్ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే కర్నూల్ డిపో2 పల్లె వెలుగు స్పెషల్ బస్సు ఉరుకుంద కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆదోని […]

Back To Top