కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో రైల్వే బ్రిడ్జి పైన బస్సు స్కూటర్ ఢీ కొట్టడంతో కోసిగి మండలం, డి బెలగల గ్రామానికి చెందిన లక్ష్మన్న, తలారి వెంకటేష్ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే కర్నూల్ డిపో2 పల్లె వెలుగు స్పెషల్ బస్సు ఉరుకుంద కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆదోని నుండి బైక్ పై తండ్రి కొడుకులు తండ్రి లక్ష్మన్న కొడుకు వెంకటేష్ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.