కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీఓ కార్యాలయం లో సర్పంచ్ , కార్యదర్శుల కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. దొడ్డనగేరి సర్పంచ్ పార్వతమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లాగా మీరుకూడా ఇబ్బందులకు గురి చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకొన్నారు.