News
హీరో నాగార్జునకు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తుంది హైడ్రా..
హీరో నాగార్జునకు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తుంది హైడ్రా..
హైదరాబాదులో శనివారం ఉదయం హీరో నాగార్జున కు సంబంధించిన N కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా..
భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు పనులు చేపట్టారు అధికారులు.

తమడికుంట సంబందించిన బఫర్లొ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు జరుపుతున్నారు .
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ప్రభుత్వ స్థలలో, చెరువులు, కుంటలు, నాలాల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో హాట్ టాపిక్గా మారిన ఎన్ కన్వెన్షన్( నాగ్ కన్వెన్షన్ హాల్) వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని, చెరువు భూమిని కబ్జా చేసి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతుండటంతో.. తమడికుంట చెరువును కబ్జా చేసి.. ఎన్ కన్వెన్షన్ నిర్మించారనిK హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తమడికుంట చెరువులోని 3.30 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని.. ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని.. తమడికుంట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని.. తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో డాక్యూమెంట్స్ పరిశీలించి.. ఆక్రమించిన స్థలాల్లో కట్టిన కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
