News
కేరళ వయనాడ్ బాదితులకు మేమున్నము అంటున్న సినీ ప్రముఖులు
వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు విరాళం ప్రకటించిన సినిహీరో మోహన్ లాల్..
వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్లాల్ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా ఉన్న మోహన్లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు..

కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్..
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సంభవించిన విపత్తుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. కేరళ నాకు ఎంతో ప్రేమను పంచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ CM రిలీఫ్ ఫండ్కు రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నా. కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

కేరళ విలయానికి ఇప్పటి వరకు నటుల విరాళాలు:..
మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు
మోహన్ లాల్ రూ.3 కోట్లు
సూర్య, జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు
మమ్ముట్టి-దుల్కర్ రూ.40 లక్షలు
కమల్ హాసన్ రూ.25 లక్షలు
ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు
విక్రమ్ రూ.20 లక్షలు
రష్మిక రూ.10 లక్షలు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




