వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు విరాళం ప్రకటించిన సినిహీరో మోహన్ లాల్..
వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్లాల్ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా ఉన్న మోహన్లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు..
కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్..
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సంభవించిన విపత్తుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. కేరళ నాకు ఎంతో ప్రేమను పంచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ CM రిలీఫ్ ఫండ్కు రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నా. కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
కేరళ విలయానికి ఇప్పటి వరకు నటుల విరాళాలు:..
మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు
మోహన్ లాల్ రూ.3 కోట్లు
సూర్య, జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు
మమ్ముట్టి-దుల్కర్ రూ.40 లక్షలు
కమల్ హాసన్ రూ.25 లక్షలు
ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు
విక్రమ్ రూ.20 లక్షలు
రష్మిక రూ.10 లక్షలు