మట్కా రాస్తున్న ముగ్గురు అరెస్ట్ 1,20,000 నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య మరియు బబ్బులమ్మ గుడి వద్ద నివాసముండే శ్రీనివాసులు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ఒకరు SKD కాలనీ కి చెందిన ఇక్బాల్ పరారీలో యూన్నాడని సిఐ విక్రమ సింహ తెలిపారు. వారి వద్దనుండి మట్కా చీటీలు, రూ. 1,20,000/- డబ్బులను, 15 లీటర్ల నిషేధిత నాటు సారాయ్ స్వాధీనం చేసుకొని ముగ్గురి కేసునమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ, సిబ్బంది రంగస్వామి, HC మద్దిలేటి , సుధీర్ , మధు, వెంకటేష్ మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు….

మట్కా నిర్వాహకుల అరెస్టు చూపిస్తున్న సి ఐ విక్రమ సింహ

ప్రజలకు పోలీసువారి విన్నపం..
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ , పేకాట ల గురించి మీకు తెలిస్తే కింది నెంబర్ సమాచారం ఇవ్వాలని
9121101135
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సిఐ విక్రమ సింహ తెలిపారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version