నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రూ. 4,24,000/- కాగా వేలం పాటలో రూ.6,29,000/- మరియు GST రూపంలో మరో రూ 1,13,220/- అనగా మొత్తం రూ. 7,42,220/- ఆదాయం వచ్చినది అని సెబ్ అధికారులు తెలిపారు.
