ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను ఆదోని ప్రజలు మరియు సిబ్బంది ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. మాజీ కమిషనర్ కన్యాకుమారి అనారోగ్యం తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.

కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సి శ్రద్ధాంజలి ఘటిస్తున్న అధికారు
ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తున్న మున్సిపల్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top