ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు
కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీలో పర్యటిస్తూ పలు జాతీయ నాయకులతో కలసి అభివృద్ధిపై చర్చలు చేసి తమ వంతు సహాయపడాలని కోరారు. జాతీయ నాయకులు ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి నీ వెంటే ఉన్నామని తెలిపినట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. ఆదోని ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం సహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పార్థసారథి ధిమా వ్యక్తం చేశారు.