కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామ ప్రజలు సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలతో నాయకులు కార్యకర్తలతో కలిసి మీనాక్షి నాయుడు కేకు కట్ చేశారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదోని నియోజకవర్గంలో ప్రజలు భారీ ఎత్తున బాణ సంచాలు కాల్చి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవ సంబరాలు ఘనంగా జరుపకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.