News
విద్యార్థుల్లో జోష్ నింపిన తెర్నకల్ సురేంద్రరెడ్డి
కర్నూల్ నగరం కేవీర్ కాలేజీ నందు వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో why ap needs jagan (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలిఅంటే ) కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా JCS కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్ యూనియన్ రెడ్డీపోగు ప్రశాంత్, మణిరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం తెర్నకల్ సురేంద్రరెడ్డి మాట్లాడుతు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ ఏపీ కి జగన్ ఎందుకు కావాలంటే ప్రజలకు, విద్యార్థి, విద్యార్నీలకు సీఎం జగనన్న నవరత్నాలలో భాగంగా ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థి, విద్యార్థినిలకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అలాగే పరోక్ష ప్రయోజనాల బదిలీ లబ్ది చేకూర్చే విధంగా మన ప్రభుత్వం పాలన సాగిందన్నారు.

పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ కి జగనే మళ్ళీ కావాలంటూ”, మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ విద్యార్థులలో జోష్ నింపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




