News
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్

■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు..
■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..
ఏపీఎస్ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్గా సన్నపురెడ్డి సురేష్రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై సమాచారాన్ని వెల్లడించారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్తు బస్సులు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. అందిన సమచారాం మేరకు ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.
News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
News
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ టవర్ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News10 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు