కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బంధువులు తెలిపిన వివరాల మేరకు తారపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.