News
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.
వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. మరియు ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన పొట్లపాడు వీరేష్, వయస్సు 28 సం. వీరిద్దరిని ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిపై PS Cr. No. 105/2024 U/s 308(3),319(1), 126(2),204, 115(2),324(4) BNS of Adoni I Town PS కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

వివరాలు ఇలాఉన్నాయి.
సోమవారం 07.10.2024 వ తేదీ రాత్రి 11:30 గంటలప్పుడు కేరళ రాష్ట్రానికి S. సుబీష్ (40) లారీ డ్రైవరు, క్లీనర్ వినోద్ తో కలసి KA 01 AJ 9676 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారిలో తాండూర్ నుంచి నాపరాయి ని లోడుతో ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై నిలబడి లారీని ఆపి తాళాలు తీసుకుని మేము RTO అధికారులము అని, లారీ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పి బెదిరించి, లారీ విడిచిపెట్టాలి అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలి అని డిమాండ్ చేశారని సిఐ తెలిపారు. అంత డబ్బు లేదు అన్నందుకు క్లీనర్ వినోద్ ఫోను తీసుకొని కిందకు పడేయడంతో, సెల్ ఫోన్ పగిలి డిస్ప్లే పోయినది. ఆ యిద్దరూ వారిపై దౌర్జన్యం చేస్తూ చేతులతో చెంపమీద, మెడమీద కొడుతుండగా డ్రైవరు మరియు క్లీనరు వారి నుండి తప్పించుకొవడానికి గట్టిగా కేకలు వేశారు అటువైపు వెళ్ళే వారు గుమ్మికూడడంతో వారు అక్కడినుండి పారి పోయారని డ్రైవర్ సుభీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ శ్రీ రామ్ కేసు నమోదు చేసామని తెలిపారు.

News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


