కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ పై కొట్టల సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న అయిదు మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఆదోని లో బందువులు ఇంటికి వెళ్లిన సొంత గ్రామమైన పెద్దకడుబుర్ మండలం చిన్నతుంబళం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అన్వర్ భాష , రేష్మ , రేష్మ బాను, తహేర్ భాషకు గాయాలు కాగా రేష్మ , అన్వర్ భాషల పరిస్తితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.