News
భక్తులను పట్టించుకోని అధికారు నాయకులు
ఆదోని కొండల్లో వేసిన దేవాలయాలకు దర్గాలకు భక్తులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఆటోలలో వెళ్తున్నారని అయితే అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా ఆదోని కొండలలో వెలసిన రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి, షా తహర్ షా ఖాద్రి దర్గా, ఎల్లమ్మ అవ్వ దేవాలయానికి మరియు అక్కడున్న ఇతర దర్గాలకు నిత్యం భక్తులు వందల సంఖ్యలో వెళుతుంటారు. అయితే కొండ ప్రాంతం ఆటోలో వెళ్లాలంటే భక్తులు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని దేవాలయాలకు దర్గాలకు వెళ్లే పరిస్థితి ఉందని అంతే కాక ఆప్రాంతం ఒక పర్యాటక స్థలం అయినందున ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆదివారం మాజీ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ దేవాలయం, దర్గా వంటి పర్యాటక స్థలాలకు బస్సు సౌకర్యం కల్పించడం చాలా అవసరం అన్నారు. బస్సు యాత్రికుల సౌకర్యాన్ని పెంచుతుంది, అలాగే ఆర్టీసీకి ఆదాయం కూడా వస్తుందని తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




