మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా గుడిపల్లి మండలం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, ఓటరుకు భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.