News
అదోనిలో 10 మంది అభ్యర్థుల పోటీ, వారి గుర్తులు
కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఫార్మ్-ఏ, ఫార్మ్-బి ఇచ్చిన పార్టీల వారికి పార్టీ రిజర్వ్ చేసిన గుర్తే కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ ఏజెంట్స్ ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఫార్మ్-8 ఇవ్వడంతో పాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు
అభ్యర్థుల పేర్లు, పార్టీ, అభ్యర్థికి కేటాయించిన గుర్తులు
గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీ అభ్యర్థులు
- ఆసియా బాను అమ్లివాలె, బహుజన సమాజ్ పార్టీ , ఏనుగు
- డా. పి. వి పార్థసారథి, భారతీయ జనతా పార్టీ, కమలం.
- జి రమేష్ యాదవ్ , భారత జాతీయ కాంగ్రెస్, హస్తం
- వై సాయి ప్రసాద్ రెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ , సీలింగ్ ఫ్యాన్
నమోదు కాబడిన రాజాకీయ పార్టీల అభ్యర్థులు - కె. రంగన్న, జై భీమ్ రావు భారత్ పార్టీ, కోర్టు
స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, పార్టీ, గుర్తులు - ఉరుకుందు వడ్డే , స్వతంత్ర అభ్యర్థి, లాప్ టాప్
- జి. జయన్న, స్వతంత్ర అభ్యర్థి, పండ్ల బుట్ట
- కే దస్తగిరి నాయుడు, స్వతంత్ర అభ్యర్థి, వజ్రం
- బి. నాగరాజు, స్వతంత్ర అభ్యర్థి, ఆపిల్
- జి. యువరాజ్, స్వతంత్ర అభ్యర్థి, గ్లాస్ టoబ్లర్
ఈ సమావేశంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్ . శేషయ్య, ఆదోని తహశీల్దార్ హసీనా సుల్తానా, ఉప తాసిల్దారులు, వినీత్, కౌసర్ భాను, రుద్ర గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
