కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన చింతకుంట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై గ్రామ సచివాలయం నందు అధికారులతో చర్చించరు.
అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహా పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, సీనియర్ సహాయకులు తిక్కస్వామి,మండల సర్వేయర్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



