కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్ద హ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పరిశీలించిన అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై చిన్న హ్యట గ్రామ సచివాలయంలో అధికారులతో చర్చించరు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ (ఇన్చార్జి) శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



