విజయవాడ గొల్ల పూడి బీసీ భవనంలో బుధవారం కురువ కార్పోరేషన్ చైర్మన్ గా మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించరు. అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ ప్రమాణం చేయించరు. బాధ్యతల అనంతరం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబును, బీసీ సంక్షేమ మంత్రి సవిత్రమ్మకు దన్యదములు తెలిపారు.
ఈ సందర్భంగా మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ ఈ బాధ్యతలు తనకు ఇవ్వటం హర్షణీయం అని రానున్న రోజుల్లో కార్పోరేషన్ నిధుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఉపాధి అవకాశాలు మెరుగుచేస్తానని తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉద్యోగులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.