News
సెప్టెంబర్ 2నుంచి విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు
దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.
మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు.
విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు
మచిలీపట్నం-విజయవాడ (07896)
విజయవాడ-మచిలీపట్నం (07769),
నర్సాపూర్-విజయవాడ (07863),
విజయవాడ-మచిలీపట్నం (07866),
మచిలీపట్నం-విజయవాడ (07770),
విజయవాడ-భీమవరం జంక్షన్ (07283),
మచిలీపట్నం-విజయవాడ (07870),
విజయవాడ-నర్సాపూర్ (07861)
గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైళ్ల వివరాలు
సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643)
సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావ్ నగర్ – కాకినాడపోర్ట్ (12756)
సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) రైళ్లను దారి మళ్లించారు.
సెప్టెంబరు 2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ – భువనేశ్వర్ (11019)
సెప్టెంబరు 2 నుంచి 29వరకు ధన్బాద్ – అలెప్పి (13351)
సెప్టెంబరు 5, 12, 19, 26తేదీల్లో టాటా – యశ్వంత్పూర్ (18111)
సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జసిధి(జార్కండ్) – తాంబరం (12376)
సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో హాతియా – ఎర్నాకుళం (22837)
సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో హాతియా – బెంగళూరు (18637)
సెప్టెంబరు 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో హాతియా – బెంగళూరు (12835)
సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో టాటా – హాతియా (12889)
ఈ తేదీల్లో ప్రయాణికులు దారి మళ్లించిన రైళ్ల మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విజయవాడ-గూడూరు డివిజన్ మధ్య, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆయా మార్గాల్లో కూడా కొన్నింటిని అధికారులు రద్దు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కొన్నింటిని పునరుద్ధరించారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
