News
మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన.. ఎస్ఎఫ్ఐ
కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమె నడపాలని డబ్బులు లేవంటే బిక్షాటన చేసి సిగ్గులేని ప్రభుత్వానికి మేము ఇస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు
తెలిపారు.

1. రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ
రాజధాని కోసం కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఖర్చు చేస్తుంది అదే పేద మధ్యతరగతి వారికి ప్రాణదాత అయిన మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావడానికె ఈ బిక్షం ఎత్తుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి ఇంటికి ప్రతి చోటికి వెళ్లి బిక్షాటన చేస్తామని ఆ వచ్చిన డబ్బులు ప్రభుత్వానికి పంపిస్తాం అప్పుడైనా నిర్మాణం పూర్తి చేయండి సిగ్గులేని సీఎం రాష్ట్రాన్ని బిక్షం ఎత్తుకునే పరిస్థితిని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందేలా 17 మెడికల్ కాలేజీలో ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేసి డబ్బులు లేవని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని కావాలంటే బిక్షాటన చేసి డబ్బులు ఇస్తామని అప్పుడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నడపాలని కోరారు.


News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
