News
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో జన్మించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి చిన్న వయసులోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో తన పోరుబాటను ప్రారంభించి మరణం వరకు ఎర్రజెండా ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా, అనతి కాలంలోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులుగా, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన మరణం సిపిఎం పార్టీ మరియు వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడానికి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏచూరి రాజకీయ నాయకుడే కాక, రచయితగాను, ఉత్తమ పార్లమెంటు సభ్యుడు గా మంచి గుర్తింపు పొందారన్నారు. 1996 యూనిటెడ్ ఫ్రంట్, 2004 యూపీఏ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు లోనూ ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇండియా వేదికను నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర ఏచూరి దే అని అన్నారు. మతతత్వ బిజెపిని నిలువరించడం కోసం ఇండియా వేదికను బలోపేతం చేయడంలో ఆయన ముందున్నారన్నారు. అలాంటి నాయకుడు, మరణించడం వామపక్ష శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయని, ఆయన ఆశయ, సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పి ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తిప్పన్న, ముక్కన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు ఊచ్చిరప్ప, మరియు పట్టణ, మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, నాగేంద్ర, బి వెంకటేష్, అజీమ్ ఖాన్, మరియు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
