ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.
విలువలతో కూడిన జర్నలిజానికి పర్యాయ పదంగా, అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరువలేనిది! జీవితాంతం ప్రజల పక్షాన అక్షరాన్ని నిలిపి..ప్రజా పరిరక్షనకు పాటుపడిన రామోజీరావు గారి మరణం తీరని లోటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *