Connect with us

News

ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి పరార్ అయిన దొంగ

Published

on

అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల నగదును దొంగలించి కేసులో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి కోర్టు ఆవరణంలో గోడదూకి పరారైన ఘటన చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళిపై ఏపీతోపాటు పక్క రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి ఆదోని టూటౌన్ లో కూడా ఇతనిపై గతంలో దొంగతనం కేసు ఉంది. పోలీసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అంతర్రాష్ట్ర దొంగను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే దొంగ పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రీటౌన్ సీఐ కి వివరణ కోరితే 41ఏ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు.

News

ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్  బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.

పూర్తి వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

ఈ  ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు  ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కౌన్సిల్ హాల్ లో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూద మరియు కౌన్సిలర్లు
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సి. హెచ్. లోకేశ్వరి
Continue Reading

News

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 15 రూ.

Published

on

By

ఆదోని 19 05 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు

19 05 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

ఆదోని డివిజన్లో వర్షపాతం నమోదు..

Published

on

By

ఆదోని డివిజన్లో శనివారం 17 వ తేది కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించిన అధికారులు
హోళగుంద – 64.2 m.m
ఎమ్మిగనూరు- 28.4 m.m
కౌతాళం – 22.0 m.m
పెద్దకడబూరు – 17.6 m.m
ఆదోని – 15.2 m.m
కోసిగి- 14.4 m.m
గోనెగండ్ల- 12.4 m.m
నందవరం – 3.8 m.m
మంత్రాలయం – 0.0 m.m
మొత్తం వర్షపాతం – 178.0 m. m
సుమారుగా కురిసిన వర్షపాతం- 19.8 m. m

Continue Reading

Trending