Connect with us

News

సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం

Published

on

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న కలెక్టర్ అధికారులు నాయకులు


కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో కెవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం జనవరిలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు గాను 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవడం జరిగిందని అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 15 మండలాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. 15 మండలాలలో కర్నూలు జిల్లా నుండి మద్దికేర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఎన్నిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం మొదటి ఫేస్ లో నీతి ఆయోగ్ సంస్థ వారు గుర్తించిన 6 అంశాల్లో సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

కలెక్టర్ స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే

సెప్టెంబర్ మాసంలోపు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించినట్లైతే మిగిలిన 33 అంశాల్లో బ్లాక్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.

వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి 3 ఇండికేటర్లు, ఐసిడిఎస్ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, వ్యవసాయ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, డి ఆర్ డి ఎ కి సంబంధించి 1 ఇండికేటర్ మొత్తం 6 ఇండికేటర్లు (అంశాలు) ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ మినహాయించి మిగిలిన అంశాల్లో ఇప్పటికే 80 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్

గర్భిణీ స్త్రీల యాంటినేటల్ రిజిస్ట్రేషన్ లో 92 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ లోపు 100 శాతం రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలన్నారు.

డయాబెటిక్ స్క్రీనింగ్ కి సంబంధించి మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు వెళ్లి హైపర్ టెన్షన్ డయాబెటిస్ అంటే షుగర్ మరియు బిపి టెస్ట్ లు అందరికీ కూడా స్క్రీన్ చేయడం జరుగుతుందన్నారు. ఎవ్వరికైనా సమస్య ఉంటే సంబంధిత వారికి మెడిసిన్స్ కూడా ఇస్తారన్నారు. కనుక దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

ముగ్గురు తిలకిస్తున్న కలెక్టర్

సప్లిమెంటరీ న్యూట్రిషన్ కి సంబంధించి గర్భిణీ మహిళలు ఎవ్వరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సంబంధిత గర్భిణీ స్త్రీలకు ప్రతినెలా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడంతో పాటు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అంశాంలో ఇప్పటికే 100 శాతం పురోగతి సాధించామని, పురోగతి శాతం తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు..

వ్యవసాయ శాఖ కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ చేయడం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాయిల్ లో ఎంత ఎరువులు కలపాలి, నైట్రోజన్ నిష్పత్తి ఎంత ఉండాలని కనుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ జరగాలన్నారు. సాయిల్ టెస్టింగ్ అంశంలో పురోగతి సాదించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు..

జడ్పిటిసి, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధిలు మద్దికేర మండలంలో కాలేజీ లేదనే విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చారని ఉన్నత అధికారులతో చర్చించి జూనియర్ కానీ డిగ్రీ కాలేజ్ గాని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్

పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ అస్పిరేషనల్ బ్లాక్ (సంపూర్ణత అభియాన్) కార్యక్రమాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించి లాభసాటి పంట పండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అస్పిరేషనల్ బ్లాక్ తరహాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తమ వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమంలో పొందుపరిచిన 6 అంశాల్లో 100 శాతం పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..

అనంతరం సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, సంపూర్ణత అభియాన్, పోషణ్ అభియాన్, ఐసిడిఎస్ ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యక్రమాలు, వ్యవసాయం శాఖ వారు ఏర్పాటు చేసిన భూసార పరీక్ష మట్టి నమూనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ అభియాన్ కిట్స్ ను కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ పంపిణీ చేశారు.

సంతకం చేస్తున్న కలెక్టర్

యాస్పిరేషనల్ బ్లాక్ కు సంబంధించి ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ పోస్టర్ పై కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, ఢిల్లీ నీతిఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ సంతకాలు చేశారు.

అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చదివిన పాఠశాలలో విద్యను అభ్యసించడానికి అర్హత సాధించిన విద్యార్థి వినయ్ కుమార్ ను కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు శాలువతో సత్కరించారు. అదే విధంగా సదరు తరగతిలో అతను టీమ్ లీడర్ గా ఉండటం పట్ల విద్యార్ధిని అభినందించారు.

తొలుత డిఆర్డిఎ పిడి, వైద్య ఆరోగ్య శాఖ అదనపు డిఎమ్హెచ్ఓ, వ్యవసాయ శాఖ అధికారులు వారి శాఖల నుండి చేపట్టిన పురోగతి వివరాల గురించి వివరించారు..సంబంధిత అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్డిఎ పిడి సలీం భాష, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మద్దికెర గ్రామ సర్పంచ్ సుహాసిని, ఎమ్ పిపి అనిత యాదవ్, జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News4 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending