News
సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం
కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో కెవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం జనవరిలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు గాను 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవడం జరిగిందని అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 15 మండలాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. 15 మండలాలలో కర్నూలు జిల్లా నుండి మద్దికేర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఎన్నిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం మొదటి ఫేస్ లో నీతి ఆయోగ్ సంస్థ వారు గుర్తించిన 6 అంశాల్లో సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

సెప్టెంబర్ మాసంలోపు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించినట్లైతే మిగిలిన 33 అంశాల్లో బ్లాక్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి 3 ఇండికేటర్లు, ఐసిడిఎస్ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, వ్యవసాయ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, డి ఆర్ డి ఎ కి సంబంధించి 1 ఇండికేటర్ మొత్తం 6 ఇండికేటర్లు (అంశాలు) ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ మినహాయించి మిగిలిన అంశాల్లో ఇప్పటికే 80 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

గర్భిణీ స్త్రీల యాంటినేటల్ రిజిస్ట్రేషన్ లో 92 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ లోపు 100 శాతం రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలన్నారు.
డయాబెటిక్ స్క్రీనింగ్ కి సంబంధించి మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు వెళ్లి హైపర్ టెన్షన్ డయాబెటిస్ అంటే షుగర్ మరియు బిపి టెస్ట్ లు అందరికీ కూడా స్క్రీన్ చేయడం జరుగుతుందన్నారు. ఎవ్వరికైనా సమస్య ఉంటే సంబంధిత వారికి మెడిసిన్స్ కూడా ఇస్తారన్నారు. కనుక దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

సప్లిమెంటరీ న్యూట్రిషన్ కి సంబంధించి గర్భిణీ మహిళలు ఎవ్వరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సంబంధిత గర్భిణీ స్త్రీలకు ప్రతినెలా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడంతో పాటు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అంశాంలో ఇప్పటికే 100 శాతం పురోగతి సాధించామని, పురోగతి శాతం తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు..
వ్యవసాయ శాఖ కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ చేయడం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాయిల్ లో ఎంత ఎరువులు కలపాలి, నైట్రోజన్ నిష్పత్తి ఎంత ఉండాలని కనుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ జరగాలన్నారు. సాయిల్ టెస్టింగ్ అంశంలో పురోగతి సాదించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు..

జడ్పిటిసి, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధిలు మద్దికేర మండలంలో కాలేజీ లేదనే విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చారని ఉన్నత అధికారులతో చర్చించి జూనియర్ కానీ డిగ్రీ కాలేజ్ గాని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ అస్పిరేషనల్ బ్లాక్ (సంపూర్ణత అభియాన్) కార్యక్రమాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించి లాభసాటి పంట పండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అస్పిరేషనల్ బ్లాక్ తరహాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తమ వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమంలో పొందుపరిచిన 6 అంశాల్లో 100 శాతం పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..
అనంతరం సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, సంపూర్ణత అభియాన్, పోషణ్ అభియాన్, ఐసిడిఎస్ ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యక్రమాలు, వ్యవసాయం శాఖ వారు ఏర్పాటు చేసిన భూసార పరీక్ష మట్టి నమూనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ అభియాన్ కిట్స్ ను కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ పంపిణీ చేశారు.

యాస్పిరేషనల్ బ్లాక్ కు సంబంధించి ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ పోస్టర్ పై కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, ఢిల్లీ నీతిఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ సంతకాలు చేశారు.

అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చదివిన పాఠశాలలో విద్యను అభ్యసించడానికి అర్హత సాధించిన విద్యార్థి వినయ్ కుమార్ ను కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు శాలువతో సత్కరించారు. అదే విధంగా సదరు తరగతిలో అతను టీమ్ లీడర్ గా ఉండటం పట్ల విద్యార్ధిని అభినందించారు.

తొలుత డిఆర్డిఎ పిడి, వైద్య ఆరోగ్య శాఖ అదనపు డిఎమ్హెచ్ఓ, వ్యవసాయ శాఖ అధికారులు వారి శాఖల నుండి చేపట్టిన పురోగతి వివరాల గురించి వివరించారు..సంబంధిత అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్డిఎ పిడి సలీం భాష, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మద్దికెర గ్రామ సర్పంచ్ సుహాసిని, ఎమ్ పిపి అనిత యాదవ్, జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


