కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న అధ్యక్షతన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో AOకి వినతిపత్రం ఇవ్వాలని ఆయన్ని పిలువగా ఏవో నిర్లక్ష్యంగా ఉండడం వలన సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం తలుపులకు వినతి పత్రాన్ని అతికించరు. అధికారులకు కనీసం వినతిపత్రం తీసుకునే తీరిక కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు దస్తగిరి, శ్రీరాములు, సురేంద్ర, ఆదోని మండల అధ్యక్షులు రంగనాథ్, దేవనకొండ మండల కార్యదర్శి భాషా, ఆస్పరి మండల కార్యదర్శి రామాంజనేయులు, పెద్దకడూబురు మండల, తుగ్గలి మండల అధ్యక్షులు రంగరాజు అధ్యక్షులు హనుమంతు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ తిప్పన్న ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, కోసిగి మండల సిఐటియు నాయకులు రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం స్థానిక మండల నాయకులు గోవిందు, రహిమాన్, రామప్ప రైతు సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి, హనుమంతు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.