News
కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్

కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్..

టీవీ9 బర్నింగ్ టాపిక్ లో తెలిపిన వివరాలు..
భారతదేశంలో ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల 10 లక్షలు ఇందులో 30 ఏళ్లకు పైగా ములుగుతున్న కేసులు 1 లక్ష 80 వేలు నేరస్తులుగా రుజువు కాక జైల్లోనే మగ్గుతున్న రిమైండ్ ఖైదీల సంఖ్య 4 లక్షలు 50 వేలు.. వీరి కోసం సపరేట్గా కొత్త జైలు నిర్మించాలి అనే పరిస్థితి..

అందుకే ఈ మార్పు తెస్తున్నామని మోడీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది.
అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..
150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు
- 1. ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS.
- 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS.
- 3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు
భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం.

- ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్..
- 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు.. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ..
- ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాలి
3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు
24 గంటల్లోనే FIR నమోదు చేయాలి.. - 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి.
అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి.. - ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి..
- పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం..
- మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష..
- చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం..
- మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి..
- బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి..
- మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి..
- అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు..
- పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు..
- క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం CCTNS..
- దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానం..
- డిజి లాకర్ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం..
- ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన..
- అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి..
- బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు..
- ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ..
- మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం..
- దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ..
- గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం..
- బాధితులకు, నిందుతులకు ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీ
- పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్..
News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 15429 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 15327 క్యూసెక్కులు

News
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు

కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షనికి రామజల చెరువు నిండి ప్రవహించడంతో చుట్టూ ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. మొత్తం ఆదోని డివిజన్లో 722 మిల్లీమీటర్లు కురవగా ఒక ఆదోనిలో అత్యధిక వర్షపాతం 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో నిజాముద్దీన్ కాలనీ, తిరుమల నగర్, కార్వాన్ పేట, ఖునిమొహాళ్ల, గోఖర్జెండా జలమయమయ్యాయి. వంకలు పొంగి వరద నీరు పోటెతడంతో పంట పొలాలు నీట మునిగాయి.



-
News2 days ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News4 weeks ago
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
-
News4 weeks ago
పోలీస్ పహరాలో రాంజల చెరువు
-
News4 weeks ago
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఆదోని సబ్ కలెక్టర్
-
News2 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News2 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News4 weeks ago
విద్యుత్ సరఫరా అంతరాయ నోటీసు
-
News2 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం