Connect with us

News

కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్

Published

on

కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్..


టీవీ9 బర్నింగ్ టాపిక్ లో తెలిపిన వివరాలు..

భారతదేశంలో ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల 10 లక్షలు ఇందులో 30 ఏళ్లకు పైగా ములుగుతున్న కేసులు 1 లక్ష 80 వేలు నేరస్తులుగా రుజువు కాక జైల్లోనే మగ్గుతున్న రిమైండ్ ఖైదీల సంఖ్య 4 లక్షలు 50 వేలు.. వీరి కోసం సపరేట్గా కొత్త జైలు నిర్మించాలి అనే పరిస్థితి..

అందుకే ఈ మార్పు తెస్తున్నామని మోడీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది.

అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..

150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు

  1. 1. ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS.
  2. 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS.
  3. 3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు
    భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం.
  • ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్..
  • 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు.. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ..
  • ఫోరెన్సిక్‌ నిపుణులచే ఆధారాలు సేకరించాలి
    3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు
    24 గంటల్లోనే FIR నమోదు చేయాలి..
  • 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి.
    అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి..
  • ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి..
  • పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం..
  • మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష..
  • చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం..
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి..
  • బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి..
  • మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి..
  • అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు..
  • పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు..
  • క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ సిస్టం CCTNS..
  • దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసంధానం..
  • డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్‌ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం..
  • ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన..
  • అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి..
  • బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు..
  • ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ..
  • మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం..
  • దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ..
  • గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం..
  • బాధితులకు, నిందుతులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఫ్రీ
  • పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్..

News

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

Published

on

అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఫుల్ వీడియో

టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

టవర్ పై ఎక్కిన యువకుడు

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు

Continue Reading

News

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

Published

on

ఆదోని, ఏప్రిల్ 13:

పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:

  • కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
  • నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
  • ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.

Continue Reading

News

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

Published

on

ఆదోని, ఏప్రిల్ 03:

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పైకప్పు ఊడిపడిన ఫోటో

ఘటన వివరాలు:

​శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:

​ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి

యాజమాన్యం వివరణ:

​ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం యూట్యూబ్ వీడియో ను క్లిక్ చేయండి

తల్లిదండ్రుల ఆందోళన:

​శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాలాజీ విద్యానికేతన్ స్కూల్ బిల్డింగ్ ఫోటో
Continue Reading
News3 days ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 weeks ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News4 weeks ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News1 month ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News2 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

News2 months ago

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

News2 months ago

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

News2 months ago

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

News2 months ago

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

News2 months ago

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Trending