చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి సియం అయినా అదే కొనసాగించారు.
ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు సచివాయం మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నరు. సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు – ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నరు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్న సీఎం చంద్రబాబు.