News
ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు
ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..
తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..
ఇది నిజమవుతుందా?
పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే
పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అడిగితే 54.1% వైఎస్ఆర్సిపి పార్టీ వస్తుందని 45.9% టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు.
రేపటి వరకు వెయిట్ అండ్ సీ…
తెల్లవారితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఈవీఎంలలో దాగి ఉన్న ప్రజల తీర్పు వెలువడుతుంది.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




