ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..
తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..
ఇది నిజమవుతుందా?
పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే
పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అడిగితే 54.1% వైఎస్ఆర్సిపి పార్టీ వస్తుందని 45.9% టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు.
రేపటి వరకు వెయిట్ అండ్ సీ…
తెల్లవారితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఈవీఎంలలో దాగి ఉన్న ప్రజల తీర్పు వెలువడుతుంది.