News
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు, ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంగా ఏర్పడి TATA IPL – 2024 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడులు చేపట్టినారు. దాడులలో ముద్దాయిలు ఎమ్మిగనూరు బై పాస్ వద్ద కల్వారీ కొండ దగ్గర ముల్లా కంపల చెట్ల క్రింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూన్న 1) ఆదోని మరాటిగేరికి చెందిన బోయ మహానంది, వయసు 49 సం. తండ్రి పేరు late బోయ రామన్న, 2) మరాట్ వాడికి చెందిన బోయ రమేశ్, వయస్సు 23 సంలు, తండ్రి పేరు బోయ మహానంది, 3) ఎమ్మిగనూరు మరెమ్మ గుడి సమీపంలో ఉంటున్న S. షహీద్, వయసు.40 సం.లు. తండ్రి పేరు జిలానీ, 4) కార్వాన్ పేటకు చెందిన బెస్త వినోద్, వయసు. 35 సం.లు S/O ఈరన్న, లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 లక్షల 50 వేలు నాలుగు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకొని ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.41/2024u/s 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Cricket Betting) Act కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.
వారు 22.04.2024 వ తేదీ న జరుగుచున్న ముంబై ఇండియన్స్ Vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భముగా క్రికెట్ బెట్టింగ్ అడే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తునారు. అందుకు వారిపైన ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో
కేసులు ఉన్నవి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని, మరాటిగేరునకు చెందిన గొల్ల భీమా, పెద్ద మసీదు ఏరియాకు చెందిన ఇస్మాయిల్, రాజరాజేశ్వరి నగర్ కు చెందిన పింజరి మహమ్మద్ ఖాసీం, కార్వాన్ పేట కు చెందిన వినోద్, LB స్ట్రీట్ కు చెందిన మూర్తి మరియు ఎమ్మిగనూరుకు చెందిన షాహీద్ లు క్రికెట్ బెట్టింగ్ ఆడే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. మొత్తం వసూలు చేసిన డబ్బులను నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఖాజా కు పంపించేవారని అందుకు వారికి రూ. 1000/- లకు రూ.2000/- లు కమిషన్ ఇస్తూ క్రికెట్ మ్యాచ్ కు టీమ్ లను బట్టి రూ 1000/- 1200, 1500, 1800, 2000 ల చొప్పున గెల్చిన వారికి
ఇచ్చేవారని సెల్ ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ ను నడుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని త్రీ టౌన్ CI P. నరసింహ రాజు తన సిబ్బంది H.C లక్ష్మణ స్వామి, P.C. నరేంద్ర, P.C.బి. పరశురాం, PC పరమేష్, PC D. గిరిబాబు, P.C. నరసింహులు, HG 134 ఇస్మాయిల్ పాల్గొన్నారు.
News
ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్
ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.
ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..



News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
News
ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



-
News3 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News4 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News4 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News3 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News7 days agoహోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
-
News2 weeks agoఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
-
News3 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News3 weeks agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
