News
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు, ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంగా ఏర్పడి TATA IPL – 2024 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడులు చేపట్టినారు. దాడులలో ముద్దాయిలు ఎమ్మిగనూరు బై పాస్ వద్ద కల్వారీ కొండ దగ్గర ముల్లా కంపల చెట్ల క్రింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూన్న 1) ఆదోని మరాటిగేరికి చెందిన బోయ మహానంది, వయసు 49 సం. తండ్రి పేరు late బోయ రామన్న, 2) మరాట్ వాడికి చెందిన బోయ రమేశ్, వయస్సు 23 సంలు, తండ్రి పేరు బోయ మహానంది, 3) ఎమ్మిగనూరు మరెమ్మ గుడి సమీపంలో ఉంటున్న S. షహీద్, వయసు.40 సం.లు. తండ్రి పేరు జిలానీ, 4) కార్వాన్ పేటకు చెందిన బెస్త వినోద్, వయసు. 35 సం.లు S/O ఈరన్న, లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 లక్షల 50 వేలు నాలుగు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకొని ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.41/2024u/s 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Cricket Betting) Act కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.
వారు 22.04.2024 వ తేదీ న జరుగుచున్న ముంబై ఇండియన్స్ Vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భముగా క్రికెట్ బెట్టింగ్ అడే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తునారు. అందుకు వారిపైన ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో
కేసులు ఉన్నవి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని, మరాటిగేరునకు చెందిన గొల్ల భీమా, పెద్ద మసీదు ఏరియాకు చెందిన ఇస్మాయిల్, రాజరాజేశ్వరి నగర్ కు చెందిన పింజరి మహమ్మద్ ఖాసీం, కార్వాన్ పేట కు చెందిన వినోద్, LB స్ట్రీట్ కు చెందిన మూర్తి మరియు ఎమ్మిగనూరుకు చెందిన షాహీద్ లు క్రికెట్ బెట్టింగ్ ఆడే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. మొత్తం వసూలు చేసిన డబ్బులను నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఖాజా కు పంపించేవారని అందుకు వారికి రూ. 1000/- లకు రూ.2000/- లు కమిషన్ ఇస్తూ క్రికెట్ మ్యాచ్ కు టీమ్ లను బట్టి రూ 1000/- 1200, 1500, 1800, 2000 ల చొప్పున గెల్చిన వారికి
ఇచ్చేవారని సెల్ ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ ను నడుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని త్రీ టౌన్ CI P. నరసింహ రాజు తన సిబ్బంది H.C లక్ష్మణ స్వామి, P.C. నరేంద్ర, P.C.బి. పరశురాం, PC పరమేష్, PC D. గిరిబాబు, P.C. నరసింహులు, HG 134 ఇస్మాయిల్ పాల్గొన్నారు.
News
భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

