News
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు, ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంగా ఏర్పడి TATA IPL – 2024 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడులు చేపట్టినారు. దాడులలో ముద్దాయిలు ఎమ్మిగనూరు బై పాస్ వద్ద కల్వారీ కొండ దగ్గర ముల్లా కంపల చెట్ల క్రింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూన్న 1) ఆదోని మరాటిగేరికి చెందిన బోయ మహానంది, వయసు 49 సం. తండ్రి పేరు late బోయ రామన్న, 2) మరాట్ వాడికి చెందిన బోయ రమేశ్, వయస్సు 23 సంలు, తండ్రి పేరు బోయ మహానంది, 3) ఎమ్మిగనూరు మరెమ్మ గుడి సమీపంలో ఉంటున్న S. షహీద్, వయసు.40 సం.లు. తండ్రి పేరు జిలానీ, 4) కార్వాన్ పేటకు చెందిన బెస్త వినోద్, వయసు. 35 సం.లు S/O ఈరన్న, లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 లక్షల 50 వేలు నాలుగు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకొని ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.41/2024u/s 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Cricket Betting) Act కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.
వారు 22.04.2024 వ తేదీ న జరుగుచున్న ముంబై ఇండియన్స్ Vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భముగా క్రికెట్ బెట్టింగ్ అడే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తునారు. అందుకు వారిపైన ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో
కేసులు ఉన్నవి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని, మరాటిగేరునకు చెందిన గొల్ల భీమా, పెద్ద మసీదు ఏరియాకు చెందిన ఇస్మాయిల్, రాజరాజేశ్వరి నగర్ కు చెందిన పింజరి మహమ్మద్ ఖాసీం, కార్వాన్ పేట కు చెందిన వినోద్, LB స్ట్రీట్ కు చెందిన మూర్తి మరియు ఎమ్మిగనూరుకు చెందిన షాహీద్ లు క్రికెట్ బెట్టింగ్ ఆడే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. మొత్తం వసూలు చేసిన డబ్బులను నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఖాజా కు పంపించేవారని అందుకు వారికి రూ. 1000/- లకు రూ.2000/- లు కమిషన్ ఇస్తూ క్రికెట్ మ్యాచ్ కు టీమ్ లను బట్టి రూ 1000/- 1200, 1500, 1800, 2000 ల చొప్పున గెల్చిన వారికి
ఇచ్చేవారని సెల్ ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ ను నడుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని త్రీ టౌన్ CI P. నరసింహ రాజు తన సిబ్బంది H.C లక్ష్మణ స్వామి, P.C. నరేంద్ర, P.C.బి. పరశురాం, PC పరమేష్, PC D. గిరిబాబు, P.C. నరసింహులు, HG 134 ఇస్మాయిల్ పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
