News
కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..

■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.
■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే..
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి కార్మికులకు రావాల్సిన బకాల కంటే అధికంగా వచ్చేలా కార్మికులకు న్యాయం చేశారు. 772 మంది కార్మికులకు కోతారీ మిల్లు నుండి దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రతి కార్మికుడికి సుమారు1,16,580/౼ రూపాయల చెప్పును ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. మొదటి చెక్కు కౌడేల్ పేటకు చెందిన వలీ భాష అనారోగ్యంతో ఉన్నారని తెలిసి వారింటికి వెళ్లి చెక్కులు అందజేశారు. అనంతరం మిగిలిన కార్మికులకు ఎమ్మెల్యే తన ఇంటి వద్ద చెక్కులను అందజేశారు. కార్మికుడు చనిపోయిన ఎడల వారి కుటుంబాలకు అందజేస్తామని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా 20 సంవత్సరాల వరకు పోరాటం చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక సంఘాలకు కార్మిక సంఘా నాయకులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదారిమి యజమాని ప్రణీత పార్ట్నర్ వీర రాఘవ రెడ్డి, అడ్వకేట్ జీవన్ సింగ్ వైసిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కార్మిక సంఘ నాయకులు అజయ్ బాబు మరియు కార్మిక సంఘం నాయకులు..
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు